సీసీకెమెరాలున్నాయి.. అయినా చోరీ జరిగింది. అవును తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సుబ్రమణ్యేశ్వర ఆలయంలో జరిగిన దొంగతనం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీ వెనుక పక్కా ప్లాన్ ఉందన్న ప్రచారం సాగుతోంది.
సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలిస్తే అప్పటికే ఆలయంలో ఉన్న వ్యక్తి అర్దరాత్రి తలుపులు తీశాడు. తరువాత ఒక వ్యక్తి ఆలయంలోకి చొరబడ్డాడు. వీరిద్దరు కలిసి ఆలయంలోని హుండిని ఎత్తుకెళ్లారు. దొంగతనం చూస్తే ఆలయం మూసేసే సమయానికి ఒక వ్యక్తి ఆలయంలో ఉన్నట్టు అర్దమవుతోంది. ముందస్తు ప్లాన్ప్రకారమే హుండీ చోరీ జరిగిందా... ఇంకా ఏదైనా జరిగిందా అన్నది పోలీసులు తేల్చేపనిలో పడ్డారు.