సుబ్రమణ్యస్వామి గుడిలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

సుబ్రమణ్యస్వామి గుడిలో హుండీ ఎత్తుకెళ్లిన దొంగలు

సీసీకెమెరాలున్నాయి..  అయినా చోరీ జరిగింది. అవును తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సుబ్రమణ్యేశ్వర ఆలయంలో జరిగిన దొంగతనం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. అర్ధరాత్రి జరిగిన ఈ చోరీ వెనుక పక్కా ప్లాన్‌ ఉందన్న ప్రచారం సాగుతోంది.

సీసీ కెమెరా ఫుటేజ్​ ను పరిశీలిస్తే అప్పటికే ఆలయంలో ఉన్న వ్యక్తి అర్దరాత్రి తలుపులు తీశాడు.  తరువాత ఒక వ్యక్తి  ఆలయంలోకి చొరబడ్డాడు.  వీరిద్దరు కలిసి ఆలయంలోని  హుండిని ఎత్తుకెళ్లారు.  దొంగతనం చూస్తే ఆలయం మూసేసే సమయానికి ఒక వ్యక్తి  ఆలయంలో ఉన్నట్టు అర్దమవుతోంది. ముందస్తు ప్లాన్​ప్రకారమే హుండీ చోరీ జరిగిందా... ఇంకా ఏదైనా జరిగిందా అన్నది పోలీసులు తేల్చేపనిలో పడ్డారు.